విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనేది చాలా మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కల. అయితే అక్కడి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో ఆ కల చాలామందికి అందని ద్రాక్షలా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ మరియు ‘మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి’ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
పథకాల ఉద్దేశం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక భరోసా కల్పించడం.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి (ఎస్సీ, ఎస్టీ): ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్, విమాన ప్రయాణ మరియు వీసా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు సాధించాలి. ఎస్సీలు జీఆర్ఈ, జీమ్యాట్, ఇంగ్లీష్ ప్రొఫిసెన్షీ టెస్ట్లో; ఎస్టీలు జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, పీఈటీలో అర్హత సాధించాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31.
మహాత్మా జ్యోతిబాఫూలే విద్యానిధి (బీసీ, ఈబీసీ): బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు, మరియు జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈలో అర్హత ఉండాలి.
అర్హత దేశాలు (ఎస్సీ, ఎస్టీ): యూఎస్ఏ, కెనడా, జర్మనీ, యూకే, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలు.
అర్హత దేశాలు (బీసీ, ఈబీసీ): యూఎస్ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.
మరిన్ని వివరాలు: కుటుంబంలోని ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవకాశాలను కల్పిస్తోంది.
Rajatheertha follows strict editorial standards. If you have corrections, updates or editorial queries, contact our desk.
Submit an Editorial Correction →




